మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని భూపాలపట్నం పంచాయతీలో కాపుల వెంకటలక్ష్మి అనారోగ్య కారణాలతో మృతిచెందడంతో ఆర్థిక సహాయం కింద వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి 50 కేజీల బియ్యం, భూపాలపట్నం సర్పంచ్ కృష్ణంరాజు, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ, నిరుపేదలకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, చిన్న వయసులో బాధ్యతలు చేపట్టిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కుందమల్లా వెంకటేశ్వర్లు, కాపుల మహాలక్ష్మి, కాపుల వెంకటమ్మ మొదలైన వారు పాల్గొన్నారు .
Post A Comment: