మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అశ్వరావుపేట లో చేపట్టిన ఆందోళనకు మద్దతుగా మండల టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు గురువారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... బీజేపీ విధానాలతో యాసంగి రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వరి పంటను కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్నారు. అశ్వరావుపేట తరలివెళ్లిన వారిలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధార వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, నాయకులు మేడ మోహన్ రావు, లంక విజయలక్ష్మి, భూక్య రాజి, భూపతి రమేష్, సత్తి నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, సూర వెంకటేశ్వర్లు, లక్ష్మీపతి,రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: