- యంపిటీసి లు నూపా సరోజని,మడకం విజయ
మన్యం మనుగడ, ములకలపల్లి:
సీపీఐ ఎం ఎల్ ప్రజాపంథా రాష్ట్ర కమిటి పిలుపులో బాగంగా చలో అసెంబ్లీ కార్యక్రమాని కి వెలుతున్న పార్టి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్,పార్టి మండల కార్యదర్శి కల్లూరి కిషోర్ లను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసారని,ఈ అక్రమ అరెస్టులను తిమ్మంపేట ఎంపిటిసి నుప సరోజిని, గంగారం ఎంపిటిసి మడకం విజయ తీవ్రంగా ఖంచారు.వారిని వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఏడు సంవత్సరాలు గా కెసీఆర్ ప్రభుత్వం విఫలమైందని,వాటిని పరిష్కరించగ పోగా వాటి పరిష్కరం కోసం పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టులు చేయడం హేమమైన చర్యని, వారు ప్రభుత్వాన్ని విమర్శించారు.తక్షణమే అర్హులందకి పెన్షన్స్,రేషన్ కార్డులు,సొంత జాగ వున్నావారికి ఐదు లక్షల రూపాయలు, కెసీఆర్ గతంలో అసెంబ్లీ లో ఇచ్చిన అన్ని హామీలు సైతం అమలు చేయాలని వారు డిమాండ్ చేసారు.
Post A Comment: