మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాత రెడ్డిపాలెం పంచాయతీలోని బయ్యారం గ్రామం లో ఐదు లక్షల రూపాయల ఎంపీటీసీ నిధులతో సి సి రోడ్డు నిర్మాణం కొరకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న గ్రామాల్లో సైతం సి సి రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు అని, ఈ విషయాన్ని గమనించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ సంతోష్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: