దమ్మపేట గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు దమ్మపేట మండలం లో 31 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని 24 వేల వేతనం ఇవ్వాలని ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని అంగవైకల్యం సంభవిస్తే ఐదు లక్షలు ఇవ్వాలి అని ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ అమలు చేయాలని ప్రతి ఆదివారం సెలవు ప్రకటించాలని ప్రభుత్వం కల్పించిన సంవత్సర సెలవులను కార్మికులకు వర్తింపచేయాలని ఎండాకాలం ఆరుబయట పనిచేస్తున్న కార్మికులకు ఉదయం ఐదు గంటల నుంచి 12 గంటల వరకు పని కల్పించాలని వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరినారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు పందేటి చెన్నారావు మండల కార్యదర్శి పేరుమల రాంబాబు గూడా వెంకటేశ్వరరావు సహదేవుడు ప్రభాకర్ రాములు గొర్రెపాటి బసవయ్య మోహన రావు బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: