మన్యం మనుగడ ప్రతినిధి, బూర్గంపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ల గుమ్మూరు గ్రామ పంచాయితీ లో నెలకొన్న సమస్యలపై గ్రామ సభ నిర్వహించగలరని తాళ్ళగొమ్మూరు గ్రామపంచాయతీ సర్పంచ్ పుల్లారావు కి వినతిపత్రం అందించారు. పంచాయితీ లో గత కొంతకాలము నుండి గ్రామ సభ నిర్వహించక పోవటం వలన గ్రామంలో సమస్యలు పరిష్కారం అవటంలేదు. పంచాయితీ లో నెలకొన్న పలుసమస్యలపై పరిష్కారం కోరుతూ గ్రామ సభ నిర్వహించగలరని జనసేన పార్టీ తరుపున కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గోవిందు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: