మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలో బట్టుపల్లి రైతు వేదిక కార్యాలయంలో దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపిపి రేగా కాళిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దళిత బంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రాంప్రసాద్ ఎస్సీ కార్పొరేషన్ ఈ డి ముత్యం పాల్గొని మాట్లాడుతూ దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులు మంచి యూనిట్ ని ఎంపిక చేసుకోని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలని తెలిపారు.అనంతరం ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ దళితుల యొక్క అభ్యున్నతి కోసం దళిత సాధికారత దళిత సమాజం ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబాటుతనానికి వివక్షకు గురై అనేక రాకల ఇబ్బందులు గురవుతున్నరాని వారి మనోవేదనను గుర్తించి దళితులకు దళిత బంధు తీసుకొచ్చి మహనీయులు సీఎం కేసీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో దళిత బంధు కమిటి చైర్మన్ కరకగూడెం మండల ఇంచార్జీ తహశీల్దారు విక్రమ్ కుమార్,కమిటీ సభ్యులు ఎంపీడిఓ శ్రీనివాస్, ఏఓ అనిల్ కుమార్, ఏపిఎం త్రీగుణ,జడ్పిటిసి కొమరం కాంతారావు, వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు,దళిత బంధు కు ఎంపికైన సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: