మన్యం టీవీ మణుగూరు:
యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉన్నత చదువులు చదివి బంగారు భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని మణుగూరు ఏఎస్పీ శబరీష్ తెలియజేశారు. ఆయన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామం లో పర్యటించారు.స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు అందరూ పోలీస్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఉద్యోగాల ప్రిపరేషన్ కు సంసిద్ధం కావాలని తెలియజేశారు. కోచింగ్ కు వెళ్లలేని పేద విద్యార్థుల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఏఎస్పీ తెలియజేశారు.ఉద్యోగం సాధించాలనే తపన మీలో ఉంటే పోలీస్ శాఖ తరపున కచ్చితంగా సహాయం అందిస్తామని ఏఎస్పీ శబరిష్ తెలియజేశారు.ఉద్యోగాలు సాధించి మీ తల్లిదండ్రులకే కాకుండా మీ గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు.యువత చెడు మార్గాల వైపు ప్రయాణించ వద్దని, వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే వెంటనే తెలియజేయాలని గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు సీఐ ముత్యం.రమేష్,పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: