CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్ధిక అక్షరాస్యత ప్రతి వ్యక్తికి అత్యంత అవసరం : కోఆర్డినేటర్ అంజిబాబు.

Share it:

 



మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 15 ) మంగళవారం ;- ఆర్ధిక అక్షరాస్యత ప్రతి వ్యక్తికి అత్యంత అవసరమని సీఎఫ్ఎల్ దమ్మపేట కో ఆర్డినేటర్ వి అంజి బాబు పేర్కొన్నారు. దమ్మపేట మండలం, బాలరాజుగూడెం గ్రామంలో ఉపాధి హామీ పని వద్ద శ్రామికులకు ఆ గ్రామ పంచాయితీ కార్యదర్శి టి సత్యనారాయణ సమక్షంలో మంగళవారం ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక అక్షరాస్యత కో ఆర్డీ నేటర్ వి అంజిబాబు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ సేవలపై ప్రతి ఒక్క పౌరుడు అవగాహాన కలిగివుండాలని సూచించారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్, రూపే కార్డ్స్ ఉపయోగాలు, సుకన్య సమృద్ధి యోజన మొదలైన కేంద్ర ప్రభుత్వ బ్యాంకు పథకాలపై అవగాహన కల్పించారు. నూతనంగా ప్రధాన మంత్రి జీవన జ్యోతి పథకంకు చేరాలి అనుకుని వారికోసం మార్చ్ 1 నుండి మార్చ్ 31 వరుకు వార్షిక ప్రీమియం 330 నుండి 86 కి మార్పు చేసిన విషియం తెలియజేసి, ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు సేవలపై అనేక చోట్ల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న కొంత మంది అవగాహన లేమితో మోస పోతున్నారని, ఇటీవలే నాయుడుపేట పట్టణంలో చింతంరెడ్డి సతీష్ రెడ్డి అనే రైతు తన ఎస్బిఐ ఖాతాను కొద్దిరోజులుగా హోల్డ్ లో పెట్టి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు ఉద్యోగులమని ఫోన్ చేసి తన బ్యాంకు ఖాతాను పునరుద్ధరించేందుకు అని చెప్పి నమ్మించి కార్డు సివివి తెలుసుకొని 74 వేల రూపాయిలు గల్లంత చేయగా మరుసటి రోజు సతీష్ రెడ్డి బ్యాంకు కి వెళ్లి మేనేజర్ నీ అడగగా తాను మోసపోయాను అని తెలుసుకున్నాడనీ, ఇలాంటి సైబర్ క్రైమ్ లు గురి కాకూడదు అంటే బ్యాంకు విషియాలు ఏవి కూడా ఫోన్ ద్వారా చెప్పరాదని అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమం లో సిఎఫ్ఎల్ ఫీల్డ్ ఇన్వెస్ట్ గేటర్ దాది చంటి, గ్రామ ప్రజలు కొమరం భద్రం, కారం నాగమణి, కారం సంతోషి, సోయం వెంకటమ్మ, సోయం రమేష్, పాయం శాంతమ్మ, పాయం నరసింహారావు, కళ్ళూరి నర్సమ్మ మరియు ఉపాధి హామీ శ్రామికులు పలువురు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: