మన్యం మనుగడ, దమ్మపేట:
అశ్వారావుపేట నియోజకవర్గంలోని గిరిజన గురుకుల పాఠశాలలో,కళాశాలలో పార్టీ టైమ్ విధులు నిర్వర్తిస్తున్న ఉపాద్యాయులు,అధ్యాపకులు వారి సమస్యలు పరిష్కరించాలని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కి వారి నివాసం దమ్మపేట(మండలం), తాటిసుబన్నగూడెం(గ్రామం),లో వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి సమస్యలు త్వరగా పరిష్కారం అయే విధంగా చేస్తానని వారికి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాల ,పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: