మన్యం మనుగడ, అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు గొల్లగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిగా పసుల శివకృష్ణ ని నియమించారు.ఈ సందర్భంగా శివ కృష్ణ మాట్లాడుతూ...తనపై నమ్మకం తో గ్రామ శాఖ అధ్యక్షుడిగా నియమించిన విప్ రేగా ,టీఆరెస్ మండల పార్టీ ఆధ్వక్షులు కోడి అమరేందర్ యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.టీఆరెస్ పార్టీ బలోపేతానికి తన వంతు గా కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎన్నా అశోక కుమార్, రమేష్ యాదవ,రామారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: