CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు కొండంత అండ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు.

Share it:

 




  •  పేదల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట.
మన్యం మనుగడ, అశ్వాపురం:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరంతరం కొనసాగిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకంలో భాగంగా 31 మంది లబ్ధిదారులకు 31 లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.
 పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వరం లాంటిదని అన్నారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గతంలో పేద కుటుంబాలు తమ ఆడపడుచులు పెళ్లిళ్లు చేయడానికి ఇబ్బందులు పడేవారని, రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని, అమలు చేసిందని ఆయన అన్నారు.
 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సంబడ వర్గాలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
 రాష్ట్ర సర్వ ముఖ అభివృద్ధి భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆసరా పింఛన్, రైతుల కోసం రైతు బందు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ పేదలకోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళల రక్షణ కోసం ఫి టీమ్స్, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యం కోసం, ఆరోగ్య కళ్యాణ లక్ష్మి పథకం బాలింతల చిన్నారుల కోసం కెసిఆర్ కిట్టు లాంటి పథకాలను ప్రవేశపెట్టారు అని ఆయన గుర్తు చేశారు.
 ఎస్సీ, ఎస్టీ ,బిసి , మైనార్టీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
 ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
 ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: