CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రక్షణ చర్యల కై అశ్వారావుపేట పోలీస్ స్పెషల్ డ్రైవ్

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో వాహనదారులు మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం రక్షణ సూత్రాలు పాటిస్తూ వాహనాలు నడపాలని అశ్వారావుపేట ఎస్ఐ చల్లా అరుణ, నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారు, పెండింగ్ చలానాలు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి వాహనాలను నిలుపుదల చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చల్లా అరుణ, మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఈ మధ్యకాలంలో జరిగిన ప్రమాదాలు చూస్తే ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణాలు సంభవించాయని, వీటిలో హెల్మెట్ లేని మరణాలే ఎక్కువగా ఉన్నాయని, నిన్న రాత్రి అశ్వారావుపేట సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరరావు, హెల్మెట్ వాడి ఉంటే మరణం సంభవించేది కాదని పోలీసు వారు సూచించేది ప్రజల ప్రాణాలను కాపాడడానికే తప్ప మరే ఉద్దేశం లేదని ప్రజలు తమ ప్రాణాలకు విలువనిచ్చి నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలని వారు సూచించారు. అదేవిధంగా పెండింగ్ చలానా లను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర పోలీస్ శాఖ వారు పెండింగ్ చలానాలు ఉన్నవారికి భారీ రాయితీ కల్పించిందని, పెండింగ్ చెలానాలు చెల్లింపుపై రాయితీని సద్వినియోగం చేసుకోవాలని, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపై 75 శాతం రాయితీ, నాలుగు చక్రాలు, హెవీ వాహనాలపై 50శాతం రాయితీ, ఆర్టీసీ వాహనాలపై 75 శాతం రాయితీలు ఉందని, ఈ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈసందర్భంగా ఎస్ఐ చల్లా అరుణ వాహనదారుల తో హెల్మెట్ వాడాలి, మద్యం తాగి వాహనాలు నడపరాదు. నిబంధనల ప్రకారం వాహనాలు నడిపి ఇంటికి క్షేమంగా వెళ్లాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ గాంధీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: