మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పరిధిలోని కన్నాయిగూడెం పంచాయతీలో గల చెన్నాపురం, కావడిగుండ్ల పంచాయితీ పరిదిలో గల దేవరకొండ అనే గిరిజన గ్రామాలలో ఎస్ఎఫ్ఎన్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు అత్యంత వెనుకబడిన గిరిజనులు తెగల అభివృద్ధి లో భాగంగా స్ధానిక పవన్ కళ్యాణ్ సేవాసమితి సహకారంతో సర్వే నిర్వహించారు. ఆ సర్వే లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలలో ఎక్కువగా సరైన పోషకాహారం లభించకపోవడంతో మహిళలు, పిల్లలకు రక్తహీనత ఉందని గ్రహించి వారికి అవసరమైన పోషకాహారాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. అలాగే మండలం లో మిగిలిన గొత్తికోయ, కొండరెడ్డి గ్రామాలను కూడా త్వరలోనే సర్వే నిర్వహించి పూర్తి స్ధాయిలో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేసినారు. దానిలో భాగంగా ఆ రెండు గ్రామాలలో ఉన్న 55 కుటుంబాలకు బట్టలను అందజేయడం జరిగింది. ఎస్ఎఫ్ఎన్ ఫౌండేషన్ సభ్యులు రామ్, పవన్ కల్యాణ్ సేవ సమితి అధ్యక్షుడు డేగల రాము, చిర్నేని సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: