CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థుల బతుకులు ఆగం చేస్తున్న ఉపాధ్యాయుడు.పాఠశాలకు రాడు వచ్చిన చరవాణిలో బాతాఖానీ.

Share it:

 





  • పాఠశాల తనిఖీకి వచ్చిన ఏ టి డి ఓ
  • ఉన్నత అధికారులకు విన్నవించిన రామవరం తల్లిదండ్రులు

మన్యం మనుగడ, అశ్వాపురం:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు పంచాయతీలోని రామవరం పాఠశాల ఉపాధ్యాయుడు శ్యామ్ నాయక్ పాఠశాలకు రాకుండా, విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడుతున్నాడని, రామవరం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులతో తమ గోడును వెల్లబోసుకున్నారు.పాఠశాలకు వచ్చినపుడల్లా ఏదో ఒక పని ఉందని సాకు చెప్పి, వెంటనే వెళ్ళి పోతూ ఉంటారు అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. బుధవారం నాడు పాఠశాల తనిఖీకి వచ్చిన, ఏ టి డి ఓ పూనెం నరసింహారావుకు విద్యార్థుల తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. ఉపాధ్యాయుని చేష్టలతో విసిగిపోయామని, తన కుమారుడికి అసలు చదువు రాదని ఓ తల్లి ఉన్నతాధికారికి తన బాధలను విన్నవించిది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గమనించి, పాఠశాలకు రాని ఉపాధ్యాయుని తొలగించి, విద్యార్థులకు విద్యను బోధించే ఉపాధ్యాయుడుని నియమించాలని రామవరం తల్లిదండ్రులు కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: