( మన్యం మనుగడ వాజేడు.)
ప్రేమ పేరుతో గిరిజన యువతి మృతికి కారణమైన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ భద్రాచలం నియోజకవర్గం యువ నాయకులు పూనెం సాయి తేజ్ డిమాండ్ చేశారు దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆదివాసి బిడ్డ ఇర్ప రాధ (23) భద్రాచలం పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రిలో నర్సి గా పనిచేస్తుంది భద్రాచలం పట్టణానికి చెందిన ఒక లోకల్ ఛానల్ కెమెరామెన్ గా విధులు నిర్వహిస్తున్నా శేఖర్ అనే వ్యక్తి అమాయక గిరిజన యువతిని ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని అన్నారు మహిళా దినోత్సవం రోజున శేఖర్ ఆ యువతికి ఫోన్ చేసి తనను ప్రేమించాలని మానసికంగా వేధించడంతో రాధ మనస్తాపానికి చెంది యువకుడితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకుందా చేసుకుందన్నారు శేఖర్ అనే వ్యక్తికి నేరచరిత్ర ఉందని గతంలో ఇద్దరమ్మాయిలను ప్రేమించి ప్రేమ పేరుతో మోసం చేశాడని రాధ మృతికి కారణమైన శేఖర్ ను కఠినంగా శిక్షించడం తో పాటు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గోండు వాన ఆదివాసి రాష్ట్ర యువసేన అధ్యక్షుడు తుర్స చంటి కుంజా రాజేష్ అట్టం ప్రవిన్ మడకం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: