మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాచలం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతన బాధ్యతలను చేపట్టిన పింగళి నాగరాజు రెడ్డి ని మర్యాద పూర్వకంగా గ్రీన్ భద్రాద్రి టీమ్ కలిసి పూల బుకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 సంవత్సరాల్లో గ్రీన్ భద్రాద్రి నాటిన మొక్కలు ఇప్పుడు భద్రాచలం మొత్తం పెద్ద వృక్షాలు గా మారి పచ్చని వాతావరణం భద్రాచలం కి ఆకర్షణీయంగా మారింది అని, ప్రజలకు ఆక్సిజన్ లభిస్తుంది అని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ సంవత్సరం కూడా సుమారు 6000 మొక్కలు నాటామని చెప్పారు. మొక్కల పెంచటం లో మరియు వాటి భద్రతలో పోలీస్ వారి సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని C.I శ్రీ నాగరాజు రెడ్డి తెలిపారు. భద్రాచలం లో ఎక్కడ ఏ మొక్కను తొలగించనా సరే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు భోగాల శ్రీనివాస రెడ్డి, తాండ్ర నరసింహా రావు , గాదె మాధవ రెడ్డి, గ్రీన్ భద్రాద్రి సెక్రటరీ పామరాజు తిరుమల రావు, కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీలం రామ్మోహన్ రెడ్డి, పి .ఆర్. వో. కడాలి నాగరాజు,అన్నెం వెంకటేశ్వర రెడ్డి,జిమ్ రామి రెడ్డి, RK .నాయుడు పాల్గొన్నారు.
Post A Comment: