మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డంపల్లి పంచాయతీలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సి సి రోడ్డు ను పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న చిన్న గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే, రాష్ట్రం పురోభివృద్ధిలో ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, పినపాక నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, గత పాలకుల పనితీరు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రేగా పనితీరును ప్రజలందరూ గమనిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం పల్లి పంచాయతీ సర్పంచ్ కలివేటి సునీల్ కుమార్,మాజీ ఎంపీపీ పడిగ నాగయ్య,కలం రాంబాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: