అశ్వాపురం, మార్చి 9 (మన్యం మనుగడ): తెలంగాణ రాష్ట్ర
ముఖ్యమంత్రి కెసిఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని అశ్వాపురం జూనియర్ కళాశాల ఒప్పంద అధ్యాపకులు పేర్కొన్నారు. బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బుధవారం అసెంబ్లీలో 11,103కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరణ, చేస్తున్నామని తీపి కబురు ఇచ్చిన సందర్బంగా ధన్యవాదాలు అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉషారాణి,రాములు, రవీందర్, సునీతరాణి ,రాఘవేంద్ర, నాగిని,సుధాకర్,అరుణ, షాజిద్ గార్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: