మన్యం మనుగడ ములుగు
ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రేడియాలజీ ల్యాబ్ ను తొలగించి వేరే ప్రాంతానికి తీసుకు వెళ్ళాలీ అని విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్ప డుతున్న రేడియాలజీ ల్యాబ్ ను తొలగించి వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ మాట్లాడుతూ.అదనపు గదులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న నూతనంగా ల్యాబ్ ను ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు చాలా ఇబ్బందు లకు గురవుతున్నారని వారు అన్నారు వెంటనే కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న రేడియాలజీ ల్యాబ్ ను తొలగించి వేరే ప్రాంతానికి చేర్చాలని విద్యార్థులకు న్యాయం చేయాలని లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు,రాస్తా
రోకోలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్య క్షుడు బాలుగు గణేష్,నాగేష్,
ప్రవీణ్,నవీన్,రాకేష్ రోషన్,అఖిల,అనూష, ప్రవళిక,రమ్య,కావ్య,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: