CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీఎం కెసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి--:పివైఎల్ జిల్లా అధ్యక్షుడు సిరికొండ రామారావు.

Share it:

 


          

  మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 10 ) గురువారం ;- ప్రగతి శీల యువజన సంఘం (PYL) పాల్వంచ డివిజన్ కమిటి సమావేశం దమ్మపేట మండలం పార్కలగండి గ్రామంలో పివైఎల్ పాల్వంచ డివిజన్ అధ్యక్షుడు కాక వెంకటేష్ అధ్యక్షతన జరిగింది

ఈ సమావేశంలో ప్రగతి శీల యువజన సంఘం (pyl )జిల్లా అద్యక్షులు సిరికొండ రామారావు పాల్గోని మాట్లాడుతూ కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఉద్యోగాల విషయంలో మాట మీద నిల బడలాని ఆయన అన్నారు ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే గతంలో కెసీఆర్ చాలా హామిలు ఇచ్చాడని దళితులకు మూడు ఎకరాల భూమ ఉచిత విద్యా పోడు భూములకు పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రతి నియోజకవర్గాని ఒక మల్టీ స్పెషాలటి హాస్పటల్బఇలా చెప్పుకుంటు పోతే చాలా ఉన్నాయనిచఇవన్ని కూడా ఎక్కడ ఆచరణలో అమలుకు నోచుకోలేదని అందుకే మాట మీద నిలబడి ఉద్యోగాలు హామీలను నిలబెట్టుకోవాలని కోరారు

అదేవిదంగా మార్చీ 23 నుండి 29 వరకు భగత్ సింగ్ వర్ధంతి సభలు గ్రామ గ్రామాన జరపాలని ఆయన జీవిత చరిత్ర నేటి యువతకు తెలియజేయాలనివ భగత్ సింగ్ జీవిత చరిత్ర ప్రతి యువకుడు తెలుసుకుని ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో పివైఎల్ జిల్లా కార్యదర్శి పి లక్ష్మణ్ ,డివిజన్ కార్యదర్శి వాసం బుచ్చిరావు, డివిజన్ కమిటి సభ్యులు కట్టం ముత్యాలరావు, సోయం చందర్ రావు, కట్టం రాంబాబు, పద్దం లక్ష్మణరావు, ఏనుగుల సతీష్, కొర్సా రామకృష్ణ, కారం రాంబాబు, కుంజా అర్జున్, తదితరులువపాల్గోన్నారు.

Share it:

TS

Post A Comment: