గుండాల మార్చి 23(మన్యం మనుగడ) భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు సాగుతామని పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు రాజేష్ అన్నారు. బుధవారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, 91వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తేవటం కోసం బ్రిటిష్ సైన్యంతో పోరాడారని అన్నారు. బానిస సంకెళ్ల విముక్తి కోసం తమ విలువైన ప్రాణాలను లెక్కజేయకుండా పోరాడారని అన్నారు. నేటి యువత వారి స్ఫూర్తి ని తీసుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈసం రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: