గుండాల /ఆళ్ల పల్లి మార్చ్ మార్చి 23(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో లో వృద్ధురాలు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులకు నిత్యవసర వస్తువులు అందించామని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాలనుసారం పది కేజీల చికెన్ ను వారి కుటుంబ సభ్యులకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఖయ్యుం, కంచర్ల రవి, బొమ్మెర ముసలయ్య, కీసరి నరేష్, బొమ్మెర సమ్మయ్య, కీసరి నగేష్, సోషల్ మీడియా అధ్యక్షులు కంచర్ల సందీప్, కంచర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: