గుండాల మార్చి 14( మన్యం మనుగడ) మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తాసిల్దార్ కార్యాలయంలో రాత్రి విధులలో ఉన్న వి ఆర్ ఏ దుర్గం బాబును కొందరు దుండగులు హత్య చేయడానికి నిరసనగా తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తాసిల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రాన్ని అందించి అనంతరం మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు వట్టం సారయ్య, గుర్రం శివాజీ లు మాట్లాడుతూ రాత్రి పూట విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ బాబును హత్య చేసిన దుండగులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దుండగులను అరెస్టు చేసే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. దుర్గం బాబు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు పాల్గొన్నారు
Post A Comment: