మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యుద్ధబేరి ప్రచార యాత్ర లో భాగంగా ఎమ్మార్పిఎస్, ఎంఎస్పి నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా విద్యార్థుల పై ఉందని తెలియజేశారు. భారత రాజ్యాంగానికి విఘాతం కలగనుంది ప్రతి ఒక్క విద్యార్థి మన రాజ్యాంగాన్ని భారత దేశ సార్వబౌమత్వాన్ని పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ప్రతి పౌరుడు తెలుసుకోవాలి తెలుసుకొని దాని యొక్క ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకవెళ్లి ప్రజలని చైతన్యవంతం చేయాలని ఏప్రిల్ 9న జరిగే చలో హైదరాబాద్ రాజ్యాంగ పరిరక్షణ యుద్దభేరి ప్రచార యాత్ర లో ప్రతి పౌరుడు పాల్గొనాలని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వావిద్యాలయ విద్యార్థి నాయకులు ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వినర్ కరుణాకర్, మండల నాయకులు రాము ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: