మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట లో నెల్లిపాక ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహాజన సభ ను నిర్వహించారు. ఈ సభలో 2020-2021 వ సంవత్సరంలో జరిగిన లావాదేవీలను, ఖర్చులను, రాబడులను సంఘం సభ్యులకు సంఘం సీఈవో రామారావు, సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి వివరించారు. ఈ సభలో రైతులు గత పాలకవర్గం సమయంలో సంఘంలో జరిగిన అవకతవకలపై జరిగిన 51 ఎంక్వయిరీ కి సంబంధించిన వివరాలను తెలపాలని కోరారు. గత పది రోజుల క్రితం సంఘం సభ్యులు అఖిలపక్షం ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ను కలిసి నెల్లిపాక సహకార సంఘం లో జరిగిన 51 ఎంక్వయిరీ కి సంబంధించిన వివరాలను తెలపాలని కోరారు. స్పందించిన కలెక్టర్ డిసిఓ ని పిలిపించి 51ఎంక్వయిరీ కి సంబంధించిన వివరాలు రైతులకు ఇవ్వాలని సూచించారు.డిసిఓ స్పందించి మహాజన సభ రోజు 51ఎంక్వయిరీ కి సంబంధించిన వివరాలు అందజేస్తానని తెలిపారని రైతులు అన్నారు. డిసిఓ లేకుండా,51ఎంక్వయిరీ వివరాలు ఇవ్వకుండా మహాజన సభను నిర్వహించవద్దని,51 ఎంక్వయిరీ డిసిఓ వచ్చి ఇచ్చేవరకు సభను వాయిదా వేయాలని,రైతులు మహాజన సభను బాయ్కాట్ చేశారు.ఈ కార్యక్రమం లో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, నెల్లిపాక సహకార సంఘం డైరెక్టర్ లు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: