CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్మిక హక్కులను కాల రాస్తున్న 4 లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా సమ్మె సన్నాహక సదస్సు. ఇఫ్టు--:జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి

Share it:



  • జిల్లా ఉపాధ్యక్షులు ఆర్, మధుసూదన్ రెడ్డి

మన్యం మనుగడ వెబ్ డెస్క్ :

భారత కార్మిక సంఘాల సమైక్య (IFTU) ఆధ్వర్యంలో మణుగూరు ఇఫ్టు కార్య లయంలో ఎండీ గౌస్ అధ్యక్షతన సమ్మె సన్నాహక సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి షేక్. యాకుబ్ షావలి, అర్. మధుసూ దన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ...మోడీ ప్రభుత్వంకార్మిక చట్టా లను రద్దు చేస్తూ వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లు తీసుకువ చ్చార ని కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ నెల 28, 29 తేదీలలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో దేశవ్యాప్త సార్వ త్రిక సమ్మె జరుగు తుం దని, ఈసమ్మెనువిజయ వంతం చేయాలన్నారు.

బ్రిటిష్ కాలం నుంచి కార్మికులు పోరాడిసాధిం చుకున్న 44 కార్మిక చట్టాలను నేటి ప్రభు త్వ0 రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మి వేస్తున్నారని విమర్శిం చారు. దేశంలో నిరుద్యో గాన్ని, పేదరికాన్ని, అసమానతలను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి, కార్మిక చట్టాలు అమలు కోసం రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్మికవర్గం పోరాడాలని పిలుపుని చ్చారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమపోరాటాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడు కోగలమని స్పష్టం చేశారు.

కార్మికవర్గం ఈ సమ్మెలో పాల్గొని మోడీ ప్రభుత్వా నికి గుణపాఠం చెప్పాల న్నారు.

సదస్సు అనంతరం కార్మిక ప్రదర్శన నిర్వ హించారు

ఈ ప్రదర్శనలో మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లకు వ్యతి రేకంగా నినాదాలు చేశారు.

       ఈ కార్యక్రమం లో ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా కమిటీ నాయకులు ఎం. రామయ్య, రాజేందర్, వి.జానయ్య, ఆర్. ప్రసాద్, పీ. సంజీవరెడ్డి, రామకృష్ణ, కోటేశ్వరరావు, చారి, అయోధ్య, లక్ష్మి, ప్రభాకర్, తిరుపతి, భాను ప్రకాష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: