మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:వెంకట్యతండా పంచాయతీలో నూతనంగా నిర్మించిన భక్తాంజనేయ ఆలయన్ని ఈనెల 27న ప్రారంభించటానికి ఆలయ కమిటీ బాధ్యులు నిర్ణయించారు. ఆలయంతోపాటు, భక్తాంజనేయ విగ్రహం, ధ్వజస్తంభం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖులు, అధికారులు,అనధికారులు హాజరుకానున్నారు
Post A Comment: