CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సర్వేనెంబర్ 27ని పీఎన్ పీడీ లో చేర్చాలని విప్ రేగా కి వినతిపత్రం అందజేసిన వీరాపురం రైతులు--:శాశ్వత పరిష్కారానికి కృషి:విప్ రేగా కాంతరావు

Share it:

 



  • హర్షం వ్యక్తం చేసిన రైతులు

మన్యం మనుగడ మణుగూరు/చర్ల:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ని చర్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన రైతులు ఆదివారం మణుగూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం అందజేశారు. సర్వేనెంబర్ 27 లో 10 ఎకరాల 40 సెంట్ల భూమి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు రేగా కాంతరావు తో వాపోయారు.తమ భూమిని పీఎన్ పిడీ లో చేర్చి మెరుగైన ప్యాకేజీ ఇప్పించాలని వారు రేగాను కోరారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు ఈ సమస్య శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలోఇర్ప వసంత్, నక్కబోయిన శ్రీను, ఆవుల శ్రీకాంత్, తోటమల్ల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: