మన్యం టీవీ మణుగూరు:
రైతుల కోసం దశల వారీ ఆందోళనలు చేయుటకు పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ నిర్ణయించినందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, పినపాక నియోజక వర్గంతో పాటు జిల్లాలో భద్రాచలం, అశ్వరావు పేట,కొత్తగూడెం, ఇల్లెందు అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పార్టీ ఆదేశించినందున మార్చి 24.03.2022 తేదీన ఉదయం 10 గంటలకు మణుగూరు లో సమావేశం నిర్వహిస్తున్నాము అని విప్ రేగా కాంతారావు తెలిపారు.మిగతా నియోజక వర్గాలలో కూడా ఎమ్మెల్యే ల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి సర్పంచులు, వార్డు సభ్యులు,ఎంపీటీసీలు,
ఎంపీపీ లు,జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్,కౌన్సిలర్లు, డీసీసీబీ ఛైర్మెన్,డైరెక్టర్స్, డీసీఎంఎస్ ఛైర్మెన్లు,డైరెక్టర్స్, పీఏసీఎస్ చైర్మన్లు,డైరెక్టర్లు, రైతుబందు అధ్యక్షులు, ఆత్మకమిటి ఛైర్మెన్,డైరెక్టర్లు, సీనియర్ నాయకులు,పార్టీ అనుబంద సంఘాల నాయకులు మరియు కమిటీ సభ్యులు,కార్మిక సంఘాల నాయకులు,అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయగలరని ఆయన కోరారు.
Post A Comment: