మన్యం మనుగడ ప్రతినిధి,అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఎస్సి కాలనీకి చెందిన గొల్లపల్లి రఘు ,బిటిపిఎస్ రోజు వారీ పనులకు వెళ్తూ ప్రమాదశాత్తూ కెమికల్ మీద పడటంతో గత కొన్ని రోజులగా హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ మృతి చెందాడు, ఈ రోజు మృతిని కుటుంబానికి న్యాయం చెయ్యాలని మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో బిటిపిఎస్ వద్ద ధర్నాకు దిగారు, ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా యువజన విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ ఇట్టి విషయం పై స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను చరవాని లో సంప్రదించగా తను హైదరాబాద్ లో ఉండి కూడా తన అనుచరులతో ప్రవేట్ కంపెనీ అధికారులతో చర్చలు జరిపి మృతిని కుటుంబానికి 20 లక్షలు నష్ట పరిహారం ఇప్పించటం జరిగింది. బి.హెచ్.సి.ఎల్. మృతిని భార్యని రోజువారీ కూలీగా తీసుకునేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా యువజన అధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ మాట్లాడుతూ , విషయం చెప్పగానే తన అనుచరులను చర్చలకు పంపించిన స్థానిక ఎమ్మెల్యే కాంతారావు కి ధన్యవాదాలుతెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ తెరాస సీనియర్ నాయకులు తాళ్లపూడి యాదగిరి గౌడ్, ముద్దకుల కృష్ణ, బర్ల సురేష్, నియోజక వర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి, సీపీఐ సీనియర్ నాయకులు బి అయోధ్య ,కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఇక్బల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: