మన్యం మనుగడ వెబ్ డెస్క్:
ముంబై:ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) అరెస్ట్ చేసింది. దావూద్ ఇబ్రహీంకు సంబంధాలున్న మనీలాండరింగ్ కేసులో ఈడీ.. మంత్రి నవాబ్ మాలిక్ను అదుపులోకి తీసుకుంది.
సుమారు 8 గంటల పాటు నవాబ్ మాలిక్ను విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నవాబ్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. నవాబ్ మాలిక్ను ఈడీ అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఆయన తన చేతిని పైకి ఎత్తి సైగలు చేయడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
దీనిపై స్పందించిన ఎన్సీసీ అధినేత శరద్ పవార్.. నవాబ్ మాలిక్పై ఈడీ దాడులు జరగుతాయని తమకు ముందే సమాచారం ఉందని అన్నారు. తాను మహారాష్ట్రకు సీఎంగా ఉన్న కాలంలో కూడా దావూద్ పేరుతో తనను కూడా టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు.
Post A Comment: