మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని తెలంగాణ భవన్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పనిచేసిన దూది కట్ల.నరసింహ చారి శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా. కాంతారావు వారి నివాసానికి వెళ్లి,దూది కట్ల నరసింహ చారి పార్థివదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విప్ రేగా స్వయంగా గా నరసింహ చారి స్వగ్రామం మహబూబాబాద్ కు పార్థివదేహాహాన్ని అంబులెన్స్ లో తరలించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన విభాగం నాయకులు,సోషల్ మీడియా సబ్యులకు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: