గుండాల ఫిబ్రవరి 7 (మన్యం మనుగడ) ప్రజల రక్షణలు ఎల్లవేళలా పోలీస్ శాఖ ముందుంటుందని కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. సోమవారం మండలం పరిధిలోని కాచన పల్లి (కొమరారం) పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కోసం 1.5 కోట్ల నిధులతో నూతన భవనాల కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా రక్షణలు ముందుండే డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అన్నారు. పట్టణాలకు దీటుగా ఏజెన్సీలోని పోలీస్ స్టేషన్ లను తీర్చిదిద్దుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి రవీందర్ రెడ్డి, గుండాల సీఐ కరుణాకర్, ఎస్ ఐ లు రమణారెడ్డి, సంతోష్ , పంచాయతీ రాజ్ డి ఈ.సైదిరెడ్డి, ఏ ఈ.అఖిల్ పాల్గొన్నారు
Post A Comment: