మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం. బాలరాజు.ములుగు జిల్లా మేడారం వెళుతున్న ఎమ్మెల్యే బాలరాజు మార్గమధ్యలో మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్ రేగా కాంతారావు ను కలిసి, శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెల్లం.బాలరాజు ను శాలువాతో ఘనంగా సన్మానించి పూల మొక్క ను అందజేసిన విప్ రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,విప్ రేగా వ్యక్తిగత సహాయకులు చందా.హరికృష్ణ,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నాయకులు,వట్టం.రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: