కోల్ మైన్ కాదది.. తెలంగాణ గోల్డ్ మైన్
సిరులవేణిపై బీజేపీ సర్కారు డేగ కన్ను
4 బ్లాకుల వేలంతో సంస్థను చంపే కుట్ర
సంస్థను దెబ్బ తీస్తే మీరే దెబ్బ తింటారు
ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు రావు..
సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా దక్కదు
కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
వేలంవెర్రి ఆలోచన మానకుంటే తరుముడే
సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్యూగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరంచేయాలని కేంద్రం కుట్ర.
తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మిక బిడ్డల కృషితో 'కార్మికులకు లాభాల్లో వాటాలు' అనే వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. సంస్థను ప్రైవేటుపరం చేస్తే, ఇకనుంచి 'నష్టాల మాటలు' అనేవి ప్రధాన శీర్షికలవుతాయి. లాభాల్లో ఉన్న సింగరేణికి బొగ్గు గనులు లేకుండా చేసి సంస్థను చంపే కుట్ర. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దళితులు, బహుజనులపై కేంద్రం చేస్తున్న దండయాత్ర, కేంద్రం ప్రవేటికరణ ఆలోచన వెంటనే విరమించుకోవాలి.......... మాలోత్ కవిత... పార్లమెంటు సభ్యురాలు మహబూబాబాద్.
Post A Comment: