CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతనంగా నిర్మించిన బోర్ ను ప్రారంభించిన ఎంపీపీ, రైతు కన్వీనర్.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, గుర్రాల చెరువు గ్రామ పంచాయితీలో ఎమ్మెల్యే మెచ్చా సూచనలు మేరకు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లీ శ్రీరామమూర్తి గుర్రాల చెరువు గ్రామ ప్రజల దాహాన్ని తీర్చడానికి ఎంపీపీ నిధుల నుండి సుమారు ఐదు లక్షల రూపాయల నిధులు కేటాయించి బోర్ వేపించారు. ఈ నూతన బోర్ ను గురువారం నాడు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ జూపల్లి రమేష్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి మాట్లాడుతూ మండలంలోని కొన్ని పంచాయతీలలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని వాటిలో గుర్రాల చెరువు గ్రామ ప్రజలు గత సంవత్సరం నుండి చాలా ఇబ్బంది పడ్డారని ఇక గుర్రాల చెరువు ప్రజలకు ఇక మంచినీటి సమస్య తీరిందని అయన తెలిపారు. ఇన్ని రోజుల నుండి వున్న మంచినీటి సమస్య తీరడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలపాల దుర్గయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: