CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం :-ఆళ్ల పల్లి పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు,ఎంపీపీ మంజు భార్గవి

Share it:

 


గుండాల/ ఆళ్లపల్లి ఫిబ్రవరి 11 (మన్యం మనుగడ) కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆళ్లపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ లాభాలలో ఉన్న సింగరేణి సంస్థను బిజెపి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి చేసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని వారు పేర్కొన్నారు. మరోమారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే మొత్తం దేశాన్ని తాకట్టు పెడతారా అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ రామయ్య , ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మయ్య , రామంజి గూడెం సర్పంచ్ నిర్మల, టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , నాయకులు కిషోర్ బాబు, ఖయ్యుమ్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: