గుండాల ఫిబ్రవరి 11 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని చీమల గూడెం గ్రామానికి చెందిన కల్తీ భవాని ఎంబిబిఎస్ సీట్ సాధించింది ఆర్థిక స్థోమత లేక చదవలేనే మోఅన్న ఆవేదనలో ఉన్న ఆమెను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే, రేగా విష్ణు ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు వారి తల్లి గారి చేతుల మీదుగా 77 వేల రూపాయల చెక్కును కరకగూడెం లో కల్తీ భవాని కి అందజేశారు. పై చదువుల కోసం తనకు అండగా నిలిచిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కు ప్రత్యేక ధన్యవాదాలు అని భవాని, అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మోకాళ్ల వీరస్వామి, గుండాల యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, భవాని తండ్రి సమ్మయ్య , బాబాయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: