మన్యం మనుగడ కరకగూడెం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు
కరకగూడెంలో నూతన మోబైల్ దుకాణం ప్రారంభించిన అనంతరం యువత ను ఉద్దేశించి మాట్లాడారు.యువత అన్ని రంగాల్లో రాణించేందుకు శ్రమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని వనరులు మనదేశానికి యువత రూపం లో ఉన్నాయని అటువంటి యువతా లోకం తాము ఎంచుకున్న రంగం లో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నం చేయాలనీ తద్వారా ఆర్ధిక అభివృద్ధి సాధించవచ్చని సూచించారు. మీరు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు. నూతన మొబైల్ షాప్ ప్రారంభించిన ముంజాల శ్రీను సోదరులు ఏర్పాటు చేసిన నూతన మోబైల్స్ దుకాణాన్ని స్థానిక వినియోగదారులకు నాణ్యమైన మోబైల్ ఉపకరణాలు అందిస్తూ అందరి అభిమానాన్ని చొరగొనాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా,కో-ఆప్షన్ సభ్యులు షేక్ సోందు పాషా,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, పార్టీ నాయకులు,గ్రామస్తులు సముద్రాల మస్తాన్,వెంకన్న,జగదీష్,బైరిశెట్టి వెంకన్న,కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: