గుండాల ఫిబ్రవరి 9 ( మన్యం మనుగడ) జీవో నెంబర్ 317 ను సవరించాలని హైదరాబాదులో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల పై లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నామని పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ప రాజేష్ ఖండిస్తున్నా మని అన్నారు. దానికి నిరసనగా మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఉపాధ్యాయుల పై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తక్షణమే జీవో నెంబర్ 317 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సురేష్ , నరేష్ , సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: