మన్యం టీవి వెబ్ డెస్క్:
నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగాన్ని విస్మరించి కేవలం రెండు శాతం మాత్రమే నిధులు కేటాయించడం బాదాకరమని విద్యా వ్యతిరేక బడ్జెట్ ను విద్యార్థిలోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ అన్నారు. ఈరోజు పిడిఎస్యు ఆధ్వర్యంలో స్థానిక ఇల్లెందు పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పి డి యస్ యూ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నరేందర్ అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి కేవలం ప్రణాళిక వ్యయం మాత్రమే కేటాయిపులు తప్ప ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి పూర్తిస్థాయిలో బడ్జెట్ కేటాయించడం లేదని దీని మూలంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని వారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కళాశాలలకు నిధులు కేటాయింపులను బడ్జెట్లో స్థానం కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలలో దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు,ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం శోచనీయం అన్నారు. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలలో విద్యా అభివృద్ధి కోసం గిరజన విశ్వవిద్యాలయం కు నిధులు కేటాయించని దుస్థితి నెలకొందన్నారు.మోడీ అనాలోచిత కారణంగా నిరుద్యోగ సమస్య మరింత తాండవిస్తుంది అని ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 8% శాతం నిరుద్యోగ సమస్య ఉందని మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ మర్చిపోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ప్రచారం మీద ఉన్న ధ్యాస విద్యా వ్యవస్థ మీద లేదని వారు అన్నారు. ఆత్మ నిర్భయ భారత్ పేరుతోని స్వలాభం కోసం పనిచేస్తున్నారు తప్ప నిరుద్యోగులు,పేదల పట్ల సంక్షేమం కోసం ఆలోచించడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకంలో ని కేంద్రం వాటా నిధులను ఇతర కేంద్రీయ విద్యాలయాల నిర్వహణకు అవసరమైన కేంద్రం వాటా నిధులను పెంచలేదని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలలో తమ సొంత, కార్పొరేట్ ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి, నిరుద్యోగులకు,నిరుపేదల సంక్షేమం కోసం అభివృద్ధి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.అవైపుగా బడ్జెట్ కేటయింపులు జరపాలని లెని ఎడల తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లో పిడిఎస్యు ఇల్లందు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ సాయి ఏ పార్థసారథి పి డి ఎస్ యు కళాశాల నాయకులు రాజుకుమార్,సందీప్,ప్రీతి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: