చండ్రుగొండ మండలం టీవీ ప్రతినిధి :అనాధ పిల్లలను అన్ని విధాల ఆడుకోవడం జరుగుతుందని డిడబ్ల్యూఓ వరలక్ష్మి అన్నారు.బుధవారం తిప్పనపల్లి గ్రామంలో ఆమె పర్యటించారు. ఇటీవల తల్లిదండ్రులు చనిపోయిన ఉషారాణి, సాయి వైష్ణవి చిన్నారులను ఆమెను ఓదార్చి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లి కోటేశ్వరి(38), తండ్రి అప్పారావు(43) చనిపోవడం దురదృష్టకరమన్నారు. నాయనమ్మ కాంతమ్మకు అన్ని విధాలా అండగా ఉంటూ, చిన్నారులకు స్కాలర్షిప్ వచ్చేలా చూస్తామని వచ్చే ఏడాది నుండి బాలికలవసతిగృహంలొ చేర్పించిటకు ఏర్పాట్లు చేస్తామన్నారు.అనంతరం గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, టీచర్లను తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సి డి పి ఓ నిర్మల జ్యోతి, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శకుంతల, అంగన్వాడీ టీచర్లు భారతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: