గుండాల/ఆళ్ల పల్లి ఫిబ్రవరి 8 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లిమండల సమస్యలపై కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వినతిపత్రం ఇచ్చామని సిపిఐ జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు. మండలంలో 252 ,212, సర్వే నెంబర్ గల మూడు వేల ఎకరాల భూమి సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలి, మండలంలో నెలకొన్న సమస్యలతో పాటు మండల కేంద్రంలోని సమస్యలను విన్నవించారు అన్నారు. రోడ్లకు నిధులు మంజూరు చేయగలరని, మండల కేంద్రంలో గల మీ సేవకు ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని, కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఆళ్లపల్లి వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య సర్పంచ్ కోటేశ్వరరావు, మండల కో ఆప్షన్ సభ్యులు రహీం, సురేందర్ వార్డ్ మెంబర్, నాయకులు పగడయ్య సూర్యనారాయణ అబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: