మన్యం టీవీ : జూలూరుపాడు, ఫిబ్రవరి 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గా ఎన్నికై, తొలిసారి రాష్ట్ర రాజధాని నుండి జిల్లా కు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా సరిహద్దు మండల కేంద్రమైన జూలూరుపాడు లో శనివారం బంజారా గిరిజన మహిళలు తమ సాంప్రదాయ పద్ధతిలో రేగా కాంతారావు కు ఘన స్వాగతం పలికారు. తమ సాంప్రదాయ ఆట పాటలతో అలరించారు. బంజారా మహిళలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, రేగా కాంతారావు కాసేపు సరదాగా ఆడి అలరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కళావతి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, సొసైటీ మాజీ అధ్యక్షులు పోలుదాసు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు, మాజీ సర్పంచ్ లకావత్ గిరిబాబు, పార్టీ సీనియర్ నాయకులు కాజా రమేష్, మాజీ ఎంపీటీసీ రోకటి సురేష్, జూలూరుపాడు ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, వెంగన్నపాలెం సర్పంచ్ గలిగే సావిత్రి, కొత్తూరు సర్పంచ్ బూరం వెంకటలక్ష్మి, కరివారి గూడెం సర్పంచ్ శాంతి రామ్, చింతలతండ సర్పంచ్ రాములు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: