మన్యంటీవి, అశ్వారావుపేట:టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు ఆదేశాలు మేరకు మూడు రోజులు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగిందని సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ తెలిపారు. అశ్వరావుపేట మండలంలోని మళ్ళాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దిబ్బ గూడెం గ్రామం నందు కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకేలా పెద్ద ఎత్తున హరితహారం మొక్కలు నాటడం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అనంతరం రక్తదాన శిభిరం కార్యక్రమం లో పాల్గొని బ్లడ్ కూడా డొనేట్ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా నారం రాజశేఖర్ మాట్లాడుతూ పోరాటయోధుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. కెసిఆర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సందర్భంగా గర్వపడేలా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువత అభిమానులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: