CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ థాక్రేతో ముగిసిన సిఎం కెసిఆర్ సమావేశం. మరికాసేపట్లో మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ సిఎం, రైతు నాయకుడు శరద్ పవార్ తో భేటీ కానున్న ముఖ్యమంత్రి కెసిఆర్.

Share it:

 


  • ముంబైలో కేసీఆర్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్వాగత తోరణాలు 


హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో కేసీఆర్ భేటీ అవుతారు. సాయంత్రం ఎన్సీపీ శరద్‌పవార్‌తో భేటీకానున్నారు. జాతీయ రాజకీయాలపై నేతలతో మంతనాలు జరుపుతారు. ముంబైలో కేసీఆర్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్వాగత తోరణాలు కట్టారు. ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారంలో ముంబైలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లారు. 

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా వార్దా నదిపై బ్యారేజీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి మహారాష్ట్ర అనుమతి పొందాల్సి ఉంది. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. కేసీఆర్‌తోపాటు ఆయన వెంట వెళ్లే బృందానికి ఠాక్రే నివాసం ‘వర్షా’లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. భోజన చర్చల అనంతరం పవార్‌ నివాసానికి వెళ్లి జాతీయ రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి..

Share it:

NATIONAL

TS

Post A Comment: