- రేపటి నుండి పోడు సాగు దారులతో చర్చలు
- పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ
మన్యం మనగడ, పినపాక:
పోడు భూములకు అడ్డు వస్తే సహించేది లేదని, విచక్షణారహితంగా పోడు భూములలో అటవీశాఖ వారు ట్రెంచ్ వేస్తున్నారని, అమీ తుమి తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, పోడు భూమి ఆదివాసీల హక్కు అని పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అన్నారు. మంగళవారం నాడు ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బుధవారం నుండి పోడు సాగు దారులతో చర్చలు ఉంటాయని, అటవీ శాఖ పోడు భూములు జోలికి వస్తే, ఆదివాసి జాతి ఊరుకోదు అని, తిరుగుబాటు చేసి పోడు భూములను సాధించుకునే హక్కు ఆదివాసీలకు ఉందని తెలియజేశారు. అటవీశాఖ గతంలోనే ఆదివాసులను చిత్ర హింసలకు గురి చేసిందని, ఈసారి ఏమైనా సరే ఎవరినీ లెక్క చేసేది లేదని, సహకారం అందించారా సరే, లేని ఎడల ఆదివాసీల ప్రతాపం చూపే సమయం ఆసన్నమైందని తెలియజేశారు.
Post A Comment: