ములకలపల్లి:ఫిబ్రవరి:09:(మన్యం మనుగడ)న్యూస్:
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కొత్త రాష్ట్రం పై నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ములకలపల్లి మండల కేంద్రంలో నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేసి,నిరసన కార్యక్రమాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావలసిన ఏ ఒక్క హామీని నెరవేర్చు కుండ తెలంగాణ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని,అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎంపీపీ మట్ల నాగమణి జగన్నాధపురం సర్పంచ్ గడ్డం భవాని సీతయ్య గూడెం సర్పంచ్,కారం సుధీర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్దార్, మండల ఉపాధ్యక్షులు మాదే బోయిన సత్యనారాయణ,తోకల గోపయ్య టిఆర్ఎస్ నాయకులు నతనియల్ జగన్నాధపురం గ్రామపంచాయతీ పార్టీ అధ్యక్షులు పలగాని చెన్నకేశవులు,పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజా ప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: