CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రికెట్ టోర్నమెంట్ విజేత జట్టుకు నగదు బహుమతి అందజేసిన ఎమ్మెల్యే రేగా.

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:ఎం ఆర్ పీ ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ 23/01/2022 నుండి 31/01/2022 వరకు అశ్వాపురం మండలం లోని నిర్వహించారు. ఈ టోర్నీలో మొత్తం 32 టీములు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో ముజ్జు లెవెన్ వర్సెస్ అంబేద్కర్ లెవెన్ జట్లు తలపడ్డాయి. మొదటిగా బ్యాటింగ్ చేసిన ముజ్జు లెవెన్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అంబేద్కర్ లెవెన్ జట్టు నిర్ణీత 15ఓవర్లలో 65 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయి 9 రన్స్ తేడాతో ఓటమిపాలైంది . ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గా గెలిచిన ముజ్జు లెవెన్ జట్టు కు 30 వేల రూపాయలు నగదు బహుమతి నీ ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేయడం జరిగినది. రన్నరప్ గా నిలిచిన అంబేద్కర్ లెవెన్ జట్టుకు 15 వేల రూపాయలు టీ ఆర్ ఎస్ పార్టీ అశ్వాపురం మండల కమిటీ కోడి అమరేందర్, కందుల కృష్ణార్జున రావు ,తోకల లత , వెన్న అశోక్, కంచు గట్ల వీరభద్రం, చిలక వెంకటరామయ్య రెండో బహుమతి బహూకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మేనేజమెంట్ కమిటీ ఇసంపల్లి కృష్ణ, గద్దల రామకృష్ణ, ఇసంపల్లి సురేష్, జుట్టు సురేష్, శివకృష్ణ,కసిపోగు ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: